Kesineni Swetha: నా చేత బలవంతంగా ఇలా చేయించారు.. కేశినేని శ్వేత షాకింగ్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ కేశినేని నానికి వెన్నుపోటు పొడిచిందన్నారు కేశినేని శ్వేత. కార్పొరేషన్ ఎన్నికల్లో తన చేత బలవంతంగా పోటీ చేయించారని.. తర్వాత మా కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గెలుపుని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

Kesineni Swetha: నా చేత బలవంతంగా ఇలా చేయించారు.. కేశినేని శ్వేత షాకింగ్ కామెంట్స్
New Update

Kesineni Swetha: విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని, విజయవాడ బెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి అసిఫ్ తరఫున ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ కేశినేని నానికి వెన్నుపోటు పొడిచిందన్నారు. పదేళ్లగా విజయవాడను కేశినేని నాని ఎంతో అభివృద్ధి చేశారని వ్యాఖ్యానించారు.

Also Read: వంగా గీతకు ఆ స్థాయి లేదు: వర్మ

విజయవాడ ప్రజల గుండెల్లో కేసినేని నాని స్థానం సంపాదించుకున్నారని..ఆయన గెలుపుని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన పొలిటికల్ టూరిస్టుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ఎన్నికల్లో తన చేత బలవంతంగా పోటీ చేయించారని వ్యాఖ్యానించారు. తర్వాత తమ కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు లోకేష్ వెన్నుపోటు దారులని మండిపడ్డారు.

#kesineni-swetha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe