దమ్ముంటే నాపై ఎంపీగా పోటీచెయ్‌.. 3 లక్షల మెజార్టీతో గెలుస్తా.. చంద్రబాబుకు కేశినేని నాని సవాల్‌

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని సంచలన సవాల్ విసిరారు. చంద్రబాబు తనపై విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే 3 లక్షల ఓట్ల మెజార్టీతో తాను గెలిచి చూపిస్తా అన్నారు.

New Update
దమ్ముంటే నాపై ఎంపీగా పోటీచెయ్‌.. 3 లక్షల మెజార్టీతో గెలుస్తా.. చంద్రబాబుకు కేశినేని నాని సవాల్‌

Keshineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని సంచలన సవాల్ విసిరారు. చంద్రబాబు (Chandrababu Naidu)పై గతంలో ఘాటుగా విమర్శలు చేసిన ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని సవాలు విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనపై విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే 3 లక్షల ఓట్ల మెజార్టీతో తాను గెలిచి చూపిస్తా అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్న నాని, అనంతరం మూటా ముల్లే సర్దుకొని హైదరాబాద్‌కు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ సభపై రాళ్లతో దాడి

తాను ఆస్తులు అమ్ముకుని, ఎన్నో అవమానాలను భరించి పార్టీని కాపాడుకుంటే ఏమాత్రం విలువ ఇవ్వకుండా వ్యవహరించారంటూ దుమ్మెత్తిపోశారు. జగన్‌ తనను ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జగన్ నిజమైన అంబేద్కర్ వాది అన్నారు.

ఇది కూడా చదవండి: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

కొన్ని మీడియా సంస్థలు కుట్రతో వ్యవహరిస్తూ జగన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మళ్లీ వైసీపీకి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో జగన్ గెలిస్తే పేదలు ఆనందంగా ఉంటారని కేశినేని నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ధనవంతులు మాత్రమే సంతోషిస్తారన్నారు.

Advertisment
తాజా కథనాలు