Sapthami Gowda : కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ.. పెళ్ళైన హీరోతో 'కాంతారా' హీరోయిన్ అక్రమ సంబంధం?

'కాంతారా' హీరోయిన్ సప్తమి గౌడ.. కన్నడ నటుడు యువరాజ్ కుమార్ తో ఎఫైర్ పెట్టుకుందట. సప్తమి గౌడ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని అతని భార్య శ్రీదేవీ ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సప్తమి గౌడ కోర్టులో పరువు నష్టం దావా వేసింది.

New Update
Sapthami Gowda : కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ.. పెళ్ళైన హీరోతో 'కాంతారా' హీరోయిన్ అక్రమ సంబంధం?

Kantara Actress Sapthami Gowda : కన్నడ ఇండస్ట్రీలో ఇటీవల స్టార్ హీరో దర్శన్ మర్డర్ కేసు (Actor Darshan Murder Case) ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. దర్శన్ మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం మూలానే ఈ ఘాతుకం జరిగింది. ఈ సంఘటనను మరువక ముందే అదే ఇండస్ట్రీలో ఇప్పుడు మరో వివాహేతర సంబంధం బయటపడింది. కాంతారా సినిమాతో (Kantara Movie) హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన సప్తమి గౌడ.. కన్నడ నటుడు యువరాజ్ కుమార్ తో (Yuvraj Kumar) ఎఫైర్ పెట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా యువరాజ్ కుమార్ భార్య బయటపెట్టింది..

అక్రమ సంబంధం...

నటుడు యువరాజ్ కుమార్, అతని భార్య మధ్య ఇటీవల గొడవలు జరిగాయి. వీళ్లిద్దరి మధ్య తరచూ గొడవలు పెరగడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. క్రమంలో రాజ్ కుమార్ తన భార్యశ్రీదేవికి ఇతరులతో ఎఫైర్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా.. ఆమె తన భర్త కాంతారా నటి సప్తమి గౌడతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. సప్తమి గౌడ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని సప్తమి గౌడ వల్ల తమ మధ్య గొడవలు వచ్చాయని శ్రీదేవీ ఆరోపణలు చేసింది. ఆమె కోసమే తనను భర్త వదిలించుకునేందుకు చూస్తున్నాడని, ఆమె కోసమే తనను భర్త వదిలించుకునేందుకు చూస్తున్నాడని శ్రీదేవి ఆరోపించింది.

Also Read : ‘కల్కి’ సాంగ్ షూట్.. సిస్టర్స్ తో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా..!

స్పందించిన హీరోయిన్...

తాజాగా శ్రీదేవి ఆరోపణలపై కాంతారా బ్యూటీ సప్తమి గౌడ స్పందించారు. దీనిపై శ్రీదేవిపై కోర్టులో పరువు నష్టం దావా వేసింది. తన కుటుంబం పరువు బైటకు పోవద్దనే ఓపికతో భరించానని, కానీ శ్రీదేవీ ఆరోపణలు ఎక్కువకావడం వల్ల ఆమె లాయర్ తో కోర్టులో దావా వేసింది. ఈ నేపథ్యంలో వీరి గోడవల్లో తన పేరును ప్రస్తావించడంను సప్తమి గౌడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తున్న నేపథ్యలో ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయోద్దంటూ కూడా కోర్టు శ్రీదేవీకి నోటీసులు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు