YCP: జనసేనకు షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు.!

మంత్రి జోగి రమేష్ తో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యడ్లపల్లి రామ్ సుధీర్. ఆయనతో పాటు మరికొందరు చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని అవమానాలు భరిస్తూ జనసేనలో పనిచేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పుకొచ్చారు.

YCP: జనసేనకు షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు.!
New Update

Janasena Leader Ram Sudheer Joined YCP: మంత్రి జోగి రమేష్ తో కలిసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు జనసేన నేత, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ..ఎన్నికల నాటికి చంద్రబాబు తో మిగిలేది కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరేనన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరు ఉండరని ఎద్దెవ చేశారు. చంద్రబాబునీ సీఎంగా చేయడం కోసమే పని చేస్తా అని పవన్ చెప్పారని..అయితే, అంత్మాభిమనం చంపుకొని పవన్ కోసం పని చేయవద్దని జనసైనికులకు సూచించారు. బాలకృష్ణ జనసేన కార్యకర్తలను ఏవిధంగా విమర్శించారో మార్చి పోవద్దని కామెంట్స్ చేశారు.

Also Read: పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్‌.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు వీళ్లే

వైసీపీ చేరిన అనంతరం యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ..జనసేనలో నాదెండ్ల మనోహర్ ఉన్నంతకాలం ఆ పార్టీ బ్రతికే పరిస్థితి లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కార్యకర్తలను నేతలను గౌరవించడని..నాదెండ్ల మనోహర్ ఏం చెప్తే అదే చేస్తాడని అన్నారు. అన్ని అవమానాలు తుడిచేసుకునే పనిచేసే అవసరం తనకు లేదని చెప్పారు.



Also Read: బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మెగా డాటర్.. చాలా హాట్ అంటున్న కుర్రాళ్లు

పేదల పక్షాన నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలనే వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎలాంటి పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనసేనలో పక్కలు వేసే వారికి ప్రాధాన్యత అని షాకింగ్ కామెంట్స్ చేశారు. నాదెండ్ల మనోహర్ టీడీపీ కి మొత్తం అమ్మేయాలని చూస్తున్నాడని..నాదెండ్ల కారణంగా జనసేన బ్రష్టు పట్టిపోయిందని దుయ్యబట్టాడు. జనసేనలో నాదెండ్ల మనోహర్ ఉన్నంతకాలం ఆ పార్టీ బ్రతికే పరిస్థితి లేదని విమర్శలు చేశారు.

#andhra-pradesh #janasena
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe