Big Breaking: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..దాదాపు 20 మంది మృతి.!

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

New Update
Big Breaking: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..దాదాపు 20 మంది మృతి.!

Jammu Kashmir Road Accident: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్ధలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

publive-image

ప్రమాదానికి గురైన బస్సు 40 మంది ప్రయాణికులతో కిష్త్వార్ నుంచి జమ్మూ వైపు వెళ్తోంది. ఈ మార్గంలో ఓ బస్సును మరో బస్సు ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ట్రుంగల్-అస్సార్ (Trungal - Assar) సమీపంలో లోయలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

publive-image

Also read: ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

publive-image

పోలీసులు, రెస్క్యూ బృందాలతో సహా స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య 20 కంటే ఎక్కువ ఉండొచ్చని దోడా పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ వారం దోడా జిల్లాలో జరిగిన రెండో ఘోర రోడ్డు ప్రమాదం ఇది.

Advertisment
తాజా కథనాలు