Jahnavi Kandula: జాహ్నవి కథ వింటే.. కన్నీళ్లు ఆగవు..! 'మరణ వార్త విని చలించిపోయా'!

కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి అమెరికాలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త విని చలించిపోయానన్నారు జాహ్నవి చదువుకున్న కాలేజీ కరస్పాండెంట్‌. అమెరికా వద్దు..కెనడా వెళ్లమని చెప్పానని.. అయితే జాహ్నవి యూఎస్‌ వైపే మొగ్గు చూపిందని చెప్పారు.

Jahnavi Kandula: జాహ్నవి కథ వింటే.. కన్నీళ్లు ఆగవు..! 'మరణ వార్త విని చలించిపోయా'!
New Update

Jahnavi Kandula death: అమెరికా(America) సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.. అక్కడి పోలీసు ఆమె అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జాహ్నవి మరణవార్త విన్న ఆమె కాలేజీ కరస్పాండెంట్‌ చలించిపోయారు. ఆర్టీవీతో జాహ్నవి కాలేజ్‌ కరస్పాండెంట్‌ మాట్లాడారు. జాహ్నవి కెరీర్‌ గురించి ఎక్కువగా ఆలోచించేదన్నారు కరస్పాండెంట్‌. అమెరికా వద్దు..కెనడా వెళ్లమని చెప్పానన్నారు కరస్పాండెంట్‌. కానీ జాహ్నవి యూఎస్‌ వైపే మొగ్గు చూపిందని చెప్పారు. అమెరికా పోలీసులు ఇలా మాట్లాడడం చాలా దారుణమని.. జాహ్నవి మరణ వార్త విన్నాక అమెరికా అంటే భయమేస్తోందన్నారు.

జోక్యం చేసుకోవాలి:
కందుల జాహ్నవి మృతిపై విచారణ జరిపేందుకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి నార్త్‌ఈస్టర్ యూనివర్సిటీలోని సీటెల్ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతుండగా చనిపోయింది. సియాటిల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన జాహ్నవి మరణంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి వీడియోను కూడా జగన్ ప్రస్తావించారు. ఇలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను ఖండించాలని.. అమెరికాలోని భారతీయులలో విశ్వాసం, భరోసాను కలిగించడానికి తప్పు చేసిన పోలీసు అధికారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలన్నారు జగన్‌.

జాహ్నవి కందులకి ఏమైంది?
జూన్‌లో విడుదల చేసిన SPD నివేదికలో అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పెట్రోల్ కారు గంటకు 74 మైళ్ల వేగంతో (గంటకు 119 కిమీ) ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది . ఢీకొనడానికి వాహనం వేగమే ప్రధాన కారణమని విచారణలో తేలిందని సీటెల్ టైమ్స్ మరో నివేదికలో పేర్కొంది. జాహ్వని మరణంపై న్యాయమైన విచారణకు యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం హామీ ఇచ్చింది . శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ విచారణ కోరిన తర్వాత ఇది జరిగింది. ఈ ఘటనను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని, అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుకు అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలోని సీనియర్ అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అమెరికా పోలీస్ మాటలు కలకలం రేపుతున్నాయి. ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ అలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అమెరికాలోని సియాటెల్ లో నార్త్ ఈస్టర్స్ లో చదువుతున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అది కూడా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టి. ఈ మరణం వివరాలు పై అధికారులకు చెబుతూ చాలా చులకనగా మాట్లాడారు. ఇదంతా అతని బాడీకి ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ALSO READ: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి ఆడియో వైరల్..!!

#jahnavi-kandula
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి