Hydra: హైడ్రా నెక్స్ట్ టార్గెట్ హైటెక్ సిటీ.. కూల్చేది వాటినే!

ఆక్రమణల కూల్చేవేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రా ఇప్పుడు హైటెక్​సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో వారం రోజుల్లో ప్రత్యేక బృందంతో ఏరియల్ సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

New Update
HYDRA.

Hydra: హైదరాబాద్ లో అక్రమకట్టడలను నేలమట్టం చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మాదాపూర్, జూబ్లీహిల్స్, మణికొండ వంటి ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో నిర్మించిన అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాగా ఇప్పుడు హైటెక్ సిటీలోని చెరువులు, నాలాలను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెరువులు ఆక్రమించి కొంతమంది పలు బాడాబాబులు కట్టిన బిల్డింగులు పడగొట్టిన హైడ్రా ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

సర్వే చేసిన ఆ నివేదికను హైడ్రా ప్రభుత్వానికి అందించనుంది. కాగా హైడ్రా నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి.. కూల్చివేతలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సర్వేను ఇంకో వార్మ్ రోజుల్లో హైడ్రా అధికారులు ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై ఇటీవల హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. కాగా హైటెక్ సిటీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందు వస్తుందో వేచి చూడాలి.

ఇటీవల రాంనగర్ లో..

ఇటీవల హైడ్రా అధికారులు రాంనగర్ లో నాలాపై నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ ను కూల్చివేశారు. కాగా, ఇప్పుడు హైటెక్ సిటీలో పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు ప్రధాన నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కాగా రాంనగర్, హైటెక్ సిటీ తరహాలో హైదరాబాద్ మొత్తంలో నాలాలను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తారా? అనే చర్చ జోరందుకుంది.

Advertisment
తాజా కథనాలు