Durgam Cheruvu : కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకిన వ్యక్తి .!

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి డెత్ స్పాట్ గా మారింది. గుర్తు తెలియని వ్యక్తి కేబుల్ బ్రిడ్జి పైన బండి పార్క్‌ చేసి ఒక్కసారిగా చెరువులోకి దూకాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Durgam Cheruvu : కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకిన వ్యక్తి .!

Also Read: గన్‌ పెట్టారు..అందినకాడికి దోచుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు!

అయితే, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి డెత్ స్పాట్ గా మారింది. రకరకాల కారణాలతో ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. తాజాగా,  గుర్తు తెలియని వ్యక్తి చెరువులోకి దూకాడు. కేబుల్ బ్రిడ్జి పైన బండి పార్క్‌ చేసి ఒక్కసారిగా చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లేక్ పోలీసులు, డీఆర్ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి వచ్చి, బోటు ద్వారా దుర్గం చెరువులో గాలిస్తున్నారు. అయితే, ఇప్పటికి ఆ యువకుడి బాడి దొరకనే లేదు. అసలు సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఎవరూ? ఎందుకు చేసుకున్నాడు. ఇలాంటి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఇంత అందమైన ప్లేస్ ఇలా సూసైడ్ స్పాట్ గా మారిడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు