హీరో ధనుష్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఇదే..

కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్  ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకుంటున్నారని గత రెండు సంవత్సరాలుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరకి ఇద్దరు కుమారులు..అయితే తాజాగా తీసుకుంటున్నట్లు ధనుష్ ప్రకటించాడు.ఇంతకీ ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం.

New Update
హీరో ధనుష్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న ధనుష్ రజినీకాంత్ కు వీర అభిమాని అని అందరికి తెల్సిన విషయమే. రజినికాంత్ తన కూతురు ఐశ్వర్యను ధనుష్ కు ఇచ్చి వివాహం చేసారు. వీరిద్దరూ ఎంతో అన్నోన్యంగా ఉండే వారు వీరికి ఇద్దరు సంతానం కూడా. వీరు తమ ఇద్దరి పిల్లలతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎం జరిగిందో ఏమో కానీ ధనుష్ ఐశ్వర్యతో కలిసి ఉండడం లేదు. వీరు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు అని ఓపెన్ గా ఎన్నోసార్లు చెప్పారు. కానీ వీరి అభిమానులు వీరు మళ్ళి కలిసి ఇంతకుముందులా సంతోషంగా ఉండాలి కోరుకున్నారు.

అయితే ధనుష్ గత చిత్రం కెప్టెన్ మిల్లర్‌కు ఓ మోస్తరు స్పందన లభించింది. ఆ తర్వాత   శేఖర్ కమ్ముళ్ల దర్శకత్వంలో నటించేందుకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్ పెట్టారు. ఇంతలో, అతను తన భార్య ఐశ్వర్య నుండి విడిపోయాడు. ఇప్పుడు వారిద్దరూ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ విడిపోవడానికి ఇదే కారణమంటూ జర్నలిస్టు సంతోష్ జోసెఫ్ చెప్పిన విషయం కలకలం రేపింది. భారతదేశంలోనే అత్యుత్తమ నటుల్లో ధనుష్‌కు పేరుంది. అతను చివరిగా కెప్టెన్ మిల్లర్‌లో కనిపించాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆలయ ప్రవేశ పోరాటం, కుల అసమానత, శ్వేతజాతీయుల పాలనపై దృష్టి సారించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓ మోస్తరు స్పందన లభించింది. ప్రధానంగా కెప్టెన్ మిల్లర్ తో పాటు  శివకార్తికేయన్ నటించిన అయాలన్ పొంగల్ రేసులో నిలిచింది. తాను పరిచయం చేసిన హీరో చేతిలో ఓడిపోవడంతో ధనుష్ కాస్త మనస్తాపానికి గురయ్యాడని అంటున్నారు.

ఇంతలో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయాడు.ఇటీవల ఈ స్టార్ దంపతులు విడాకులు కోసం చెన్నైలోని కుటుంబ కోర్టులో పిటిషన్ వేశారు.హీరో ధనుష్ కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పుడు సినిమాల గురించే ఆలోచిస్తాడట. తనకు ఓ ఫామిలీ ఉంది. కొంత సమయం అయినా కుటుంబంతో గడపాలని ఐశ్వర్య ఎన్నో సార్లు హెచ్చరించిందట. అయినా కూడా భార్య మాటలను పట్టించుకోలేదట ధనుష్. ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయట. దీనితో ఐశ్వర్య విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకుందట.

Advertisment
తాజా కథనాలు