/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rains-1-jpg.webp)
Telangana Rains: తెలంగాణలో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిస్తోంది. అరగంట సేపు రాళ్ల వాన పడడంతో జనం భయంతో వణికిపోయారు. ఆదిలాబాద్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. అకాలవర్షాలతో మిర్చి, టమాట పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుముల, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విచాయి.