AP: వరద బీభత్సం.. వాగులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు..చివరికి..

పశ్చిమగోదావరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. తాడేపల్లిగూడెం మాధవరంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వాగులో చిక్కుకున్నారు. స్థానికులు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న వారిని సురక్షితంగా కాపాడారు.

New Update
AP: వరద బీభత్సం.. వాగులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు..చివరికి..

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం మాధవరంలోని వాగులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు వాగు దాటుతుండగా వరద పోటెత్తింది. దీంతో బైకుతో సహా ఇద్దరు వ్యక్తులు వాగులో చిక్కుకుపోయారు. వెంటనే స్థానికులు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న వారిని స్థానికులు కాపాడారు. దీంతో ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.

Also Read : ఈ వారం థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు..! వివరాలివే

Advertisment
తాజా కథనాలు