హరియాణాకు కూడా వర్గపోరు కార్చిచ్చు అంటుకుంది. నుహ్లో రెండు వర్గాలకు జరిగిన ఘర్షణలో ఇద్దరు హోం గార్డులు చనిపోయారు. ఓ వర్గం నిర్వహించిన యాత్రను వేరొక వర్గానికి చెందిన యువత అడ్డుకోవడం వల్ల ఘర్షణలు తలెత్తాయి. ఓ సంస్థ కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ అల్లర్లకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..హరియాణాలోనూ వర్గపోరు …ఇద్దరు హోంగార్డుల దుర్మరణం..!
హరియాణాకు కూడా వర్గపోరు కార్చిచ్చు అంటుకుంది. నుహ్లో రెండు వర్గాలకు జరిగిన ఘర్షణలో ఇద్దరు హోం గార్డులు చనిపోయారు. ఓ వర్గం నిర్వహించిన యాత్రను వేరొక వర్గానికి చెందిన యువత అడ్డుకోవడం వల్ల ఘర్షణలు తలెత్తాయి. ఓ సంస్థ కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ అల్లర్లకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఊరేగింపులో పాల్గొన్న వాహనాలకు అల్లరి మూకలు నిప్పంటించాయి. మరి కొంతమంది యువకులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.మరోవైపు శాంతి భద్రతలను నెలకొల్పేందుకు హరియాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో బుధవారం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది
Translate this News: