Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనం స్పెషల్.. రాత్రంతా ఎంఎంటీఎస్ ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే!

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రేపు ఉదయం 4.40 గంటల వరకు స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనం స్పెషల్.. రాత్రంతా ఎంఎంటీఎస్ ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే!

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం (Ganesh Nimajjanam 2023) వేడుకలు హైదరాబాద్ మహానగరంలో వైభవంగా సాగుతున్నాయి. మహాగణపతి శోభాయాత్ర సైతం ప్రారంభమైంది. మరో వైపు ఇప్పటికే ట్యాంక్ బండ్ కు భారీగా వినాయకుడి విగ్రహాలు చేరుకుంటున్నాయి. హైదరాబాద్ లో మొత్తం లక్ష విగ్రహాలు నేడు నిమజ్జనం కానుండగా.. కేవలం హుస్సేన్ సాగర్ లోనే 30 వేలకు పైగా గణేశ్ ప్రతిమల నిమజ్జనం సాగనుంది. ఓల్డ్ సిటీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఘనంగా కొనసాగే మహాశోభయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి రానున్నారు. రేపు ఉదయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. రాత్రి పూట కనుల పండువగా సాగే శోభాయాత్రను చూడడానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Train No.GSH-5: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28న రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.GSH-1: సికింద్రాబాద్-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28వ తేదీ రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. మరుసటి రోజు 00:20 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
Train No.GLF-6: లింగంపల్లి-ఫలక్ నూమా ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ఈ నెల 29న ఉదయం 12.10 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. 01:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.GHL-2: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న ఉదయం 12:30 గంటలకు బయలుదేరి.. 01:20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.
Train No.GLH-3: లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న ఉదయం 01:50 గంటలకు బయలుదేరి.. 02:00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.GFS-7: ఫలక్ నూమా-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న 02:20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 03:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.GHS-4: హైదరాబాద్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న నడపనుంది దక్షిన మధ్య రైల్వే. ఈ స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్ 03:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04:00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
Train No.GSH-8: సికింద్రాబాద్-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 04:00 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. 4:40 గంటలకు హైదరాబాద్ కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఇది కూడా చదవండి: Ganesh Immersion : గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాయకుడు..ఉదయం 6గంటలకే శోభాయాత్ర ప్రారంభం..!!

Advertisment
తాజా కథనాలు