Food Poison: స్కూల్ లో ఫుడ్ పాయిజన్.. 14 మంది అస్వస్థత

యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
Food Poison: స్కూల్ లో ఫుడ్ పాయిజన్.. 14 మంది అస్వస్థత

Food Poison:  యాదాద్రి భువనగిరి సోషల్ వెల్పేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, గుట్టు చప్పుడు కాకుండా స్కూల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Also Read: బాలీవుడ్ రామాయణంలో సాయి పల్లవి..ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. పిల్లలు అనారోగ్యం బారిన పడితే కనీసం సమాచారం ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. విద్యార్ధుల అస్వస్ధతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు