AP: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..!

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులు అవుతున్న ఇప్పటివరకు డబ్బులు వేయలేదంటూ నిరసనకు దిగారు.

New Update
AP: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..!

Konasema: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులు అవుతున్న ఇప్పటివరకు డబ్బులు వేయలేదంటూ నిరసనకు దిగారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించకపోతే తొలకరి పంట విరామం చేస్తామంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళనకు దిగారు.

Also Read: ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదు.. అందుకే జగన్ కు శాపం తగిలింది : శ్రీరామ శర్మ

తొలకరి పంటకు పెట్టుబడి పెట్టలేక.. పాత అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించకపోతే క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామంటూ రైతులు హెచ్చరించారు. దాన్యం బకాయిలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం జిల్లా రైతులు ఆందోళనకు దిగారు.

Advertisment
తాజా కథనాలు