Chintha Mohan: కాంగ్రెస్ 5 శాతం కూడా ఇలా చేయలేకపోయింది.. చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..!

వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5 శాతం కూడా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశారు.

Chintha Mohan: కాంగ్రెస్ 5 శాతం కూడా ఇలా చేయలేకపోయింది.. చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..!
New Update

EX.MP Chintha Mohan: వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5 శాతం కూడా దేశవ్యాప్తంగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశారు.

Also Read: జగన్ పక్క ప్లానింగ్ తోనే ఇలా అన్నారు.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!

గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చుకు పార్టీ ఇచ్చిన నగదును ఓ పోలీస్ అధికారి స్థానికంగా ఉన్న ఎస్ఆర్ఎం లాడ్జిలో కూర్చొని పంపిణీ చేశారని ఆరోపించారు. అయితే అధికారి పేరు చెప్పడానికి నిరాకరించారు. దుగ్గరాజపట్నం పోర్టును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడ్డుపడిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

#ex-mp-chintha-mohan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి