TDP Gollapally : టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై..!

టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాజోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై గొల్లపల్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కండువా కప్పుకునేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లికి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి.

TDP Gollapally : టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై..!
New Update

Ex-Minister Gollapally Surya Rao: తూర్పు గోదావరి జిల్లా రాజోలులో టీడీపీకి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీని వీడి గొల్లిపల్లి వైసీపీ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. రాజోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై గొల్లపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు నేతలు అంటున్నారు.

Also Read: ఉండి టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. నియోజకవర్గంలో ముదురుతున్న రాజు బ్రదర్స్‌ వర్గ పోరు..!

ఈ నేపథ్యంలోనే వైసీపీ కండువా కప్పుకునేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లికి వెళ్లారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. రాజోలు వైసీపీ టికెట్ ఆశించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే, వైసీపీలో ప్రస్తుతం జనసేన నుంచి వచ్చిన రాపాక వరప్రసాద్ కొనసాగుతున్నారు. దీంతో, ఇద్దరి మధ్య వైసీపీ టికెట్ పై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Also Read: రాడిసన్ డ్రగ్స్‌ కేసులో పెను సంచలనాలు.. నిందితుల లిస్ట్‌ లో స్టార్ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి..!

ఇదిలా ఉండగా.. గొల్లపల్లి వైసీపీలో చేరితే.. రాజోలుతో పాటు కోనసీమ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో లెక్కలు మారిపోతాయని అంటున్నారు పరీశీలకులు. టీడీపీ - జనసేన కూటమికి చెప్పుకునే నాయకుడు ఉండరని.. పి.గన్నవరంలో కూడా తెలుగుదేశం బలం పోయినట్లే అని చెబుతున్నారు. కారణం.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట టిక్కెట్ వస్తుందనే ఆశతోనే గొల్లపల్లి.. ఈ రెండు చోట్లా బాగా పట్టు సాధించారు. అయితే అనూహ్యంగా పి.గన్నవరం మహాసేన రాజేష్ కి ఇవ్వడం.. రాజోలు జనసేనకు అని చెప్పడంతో గొల్లపల్లి హర్ట్ అయ్యారని తెలుస్తుంది.

Also Watch This Video:

#ex-minister-gollapally-surya-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe