crime: అన్సారీ పోలీసులకు భయపడేవాడు కాదు!

ముఖ్తార్ అన్సారీ కేసులు ఇప్పుడు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్టం,పోలీసుల పైన అన్సారీ కి అసలు లెక్క ఉండేది కాదని,అతడు 30 ఏళ్ల వయసులోనే తన అనుచరులతో కలసి కిడ్నాప్ లు చేసేవాడని దిల్లీ రిటైడ్ పోలీస్ అధికారి తెలిపారు.

New Update
crime: అన్సారీ పోలీసులకు భయపడేవాడు కాదు!

గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ 30 ఏళ్ల వయస్సులో చట్టానికి భయపడనని చూపించాడు. 1993లో ఓ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ముఖ్తార్ స్వయంగా తన నేరాలను వెల్లడించాడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసు ఢిల్లీలోని లుటియన్స్‌కు చెందిన వ్యాపారిని కిడ్నాప్ చేసి విమోచన డిమాండ్‌కు సంబంధించినది.

ముఖ్తార్ అన్సారీ అతని అనుచరులు దిల్లీ లోని వ్యాపారవేత్త వేద్ ప్రకాష్ గోయల్‌ను కిడ్నాప్ చేసి, అతని కుటుంబం నుండి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఆ సమయంలో  అశోక్ చంద్ క్రైమ్ బ్రాంచ్ పోలీల్ అధికారి ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో పంజాబ్-హర్యానా సరిహద్దులో కిడ్నాప్ అయిన గోయల్‌ను కాపాడారు.

ముఖ్తార్ అతని అనుచరులు వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసినప్పుడు,
రిటైర్డ్ ఢిల్లీ పోలీసు అధికారి అశోక్ చంద్, ఈ కిడ్నాప్ కేసును గుర్తు చేసుకుంటూ, గోయల్ తన  కారులో ప్రయాణిస్తున్నాడని అతను తన స్నేహితుడి పుట్టినరోజు కు వెళ్ళి వస్తుండగా  7 డిసెంబర్ 1993న కిడ్నాప్ అయ్యాడని చెప్పాడు. అన్సారీ  అతని ఇద్దరు సహచరులు తిలక్ మార్గ్ ప్రాంతం నుండి గోయల్‌ను కిడ్నాప్ చేశారని ఆయన చెప్పాడు. అన్సారీ దక్షిణ ఢిల్లీలోని గెస్ట్ హౌస్‌లో ఉంటున్నాడని అతని సహచరులు పోలీసులకు చెప్పారని, ఆ తర్వాత అతన్ని కూడా పట్టుకున్నారని చెప్పారు.

'(అన్సారీ) వయస్సు దాదాపు 30 ఏళ్లు, చట్టం అంటే అతను లెక్క లేకుండా  ఉండేవాడు.  "మేము అతని నుండి ఒక రైఫిల్  పెద్ద సంఖ్యలో కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నాము" అని అధికారి తెలిపారు. అన్సారీ  గన్ బాగా కాల్చేవాడని గురి పెట్టాడంటే లక్ష్యం మిస్ అయ్యేది కాదని అని తెలిపాడు. అతడు ఇంతా పెద్ద గ్యాంగ్ స్టర్ అవుతాడని అతనే ఊహించి ఉండడని ఆయన అన్నాడు.

ముఖ్తార్‌పై 61 కేసులు నమోదయ్యాయి.భూకబ్జాలు
, దోపిడీ, కిడ్నాప్, డబ్బు కోసం హత్య, హత్య, హత్యాయత్నం, ఆయుధాల చట్టంతో సహా 61 కేసులు అన్సారీపై ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం 2009లో నమోదు చేసిన 'పోటా' (ఉగ్రవాద నిరోధక చట్టం) మరియు 'MCOCA' (మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) సహా మరో రెండు కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బండా జైలులో ఉన్న సమయంలో అనారోగ్యం కారణంగా, 5 సార్లు ఎమ్మెల్యే అన్సారీని అక్కడి వైద్య కళాశాలలో చేర్చారు, అక్కడ చికిత్స సమయంలో గుండెపోటుతో అన్సారీ గురువారం మరణించారని మీకు తెలియజేద్దాం.

Advertisment
తాజా కథనాలు