Eco Friendly Ganesh – వినాయక ఉత్సవాలపై ఆన్లైన్ క్విజ్..
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కల్పించేందుకు అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించినవారిని, పర్యావరణానికి హాని కలగకుండా ఉత్సవాలు నిర్వహించేవారిని ప్రోత్సహించేందుకే నగదు బహుమతి అందించనున్నారు. పర్యావరణ హిత వినాయకుడి విగ్రహారాధనపై ఆన్లైన్ క్విజ్ సైతం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.10 లక్షల వరకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు పీసీబీ సభ్య కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య. పీసీబీ కార్యాలయంలో ఆయన పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు.
Eco Friendly Ganesh Bumper Offer: మట్టి గణేశుడికి బంపర్ ఆఫర్..రూ.10 వేలు బహుమతి
పర్యావరణహిత గణేశుడికి బంపర్ ఆఫర్ ప్రకటించారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి. పర్యావరణానికి హాని కలుగకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహించేవారిని ప్రోత్సహించేందుకే నగదు బహుమతి అందించనున్నారు. ఫస్ట్ ప్రైజ్ రూ.10 వేలు, సెకండ్ ప్రైజ్ రూ.5 వేలు, తార్డ్ ప్రైజ్ రూ.3 వేలు అందించనున్నారు. ఈ విషయాలను పీసీబీ సభ్య కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య చెప్పారు.
Translate this News: