Andhra Pradesh: సీఎం పర్యటనలో అపశృతి.. హెలీప్యాడ్ వద్ద కుప్పకూలిన ధర్మాన కృష్ణదాస్ తనయుడు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు ధర్మాన కృష్ణ చైతన్య కుప్పకూలిపోయారు.

New Update
Andhra Pradesh: సీఎం పర్యటనలో అపశృతి.. హెలీప్యాడ్ వద్ద కుప్పకూలిన ధర్మాన కృష్ణదాస్ తనయుడు..

Dharmana Krishna Chaitanya: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు ధర్మాన కృష్ణ చైతన్య కుప్పకూలిపోయారు. హెలీప్యాడ్ వద్ద నేతలను ఎల్ టు గేలరీలోకి పంపించే క్రమంలో కృష్ణ చైతన్య ఒక్కసారిగా కుప్ప కూలి పోయారు. అది గమనించిన ఆర్టీవీ ప్రతినిధి నేతృత్వంలో తన వాహనంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చైతన్యను పరిశీలించిన వైద్యులు.. ప్రాణాపాయం ఏమీ లేదన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాగా, కృష్ణ చైతన్య పోలాకి జెడ్పీటీసీగా ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్ తనయుడిగా, వైసీపీ నేతగా శ్రీకాకుళం జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కాగా, శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైఎస్ఆర్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం. ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Also Read:

రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు..

Advertisment
తాజా కథనాలు