Movie in Theaters: మన జీవితంలోని ప్రతి అంశంలోనూ సినిమా ఉంటుంది. వినోదం అంటే ఇప్పటికీ సినిమానే చాలామందికి. టెక్నాలజీ మారిపోయినా.. నట్టింటిలో కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా సినిమాపై మోజు మాత్రం ప్రజల్లో ఏమాత్రం తగ్గడం లేదు. ఐపీఎల్ వంటి క్రికెట్ పోటీలకు విపరీతమైన క్రేజ్ ఉన్నా.. దేని దారి దానిదే అన్నట్టుగా సినిమాపై మోజు మాత్రం ఎవరికీ తగ్గడం లేదు. ఇప్పటికీ టీవీల్లో వచ్చే ఆపాతమధురాలను ఆదరిస్తూనే.. కొత్త సినిమాలు ఓటీటీలో వస్తుంటే వాటిని వదిలిపెట్టకుండా ఉంటూనే.. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లు అన్నిటినీ చూసేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. సినిమాపై(Movie in Theaters) ఆసక్తి తగ్గేదేలే అన్నట్టు ఉంది. అయితే, సాధారణంగా మనం ఓటీటీలు వచ్చేశాయి.. కొత్త సినిమాలు దాదాపు నెలరోజుల్లోపు (ఒక్కోసారి ఇంకా తొందరగా) మన ఇంటిలోనే కూచుని చూసే అవకాశం కూడా దొరికేస్తోంది.. ఇక థియేటర్స్(Movie in Theaters) కి వెళ్లి సినిమాలు చూడటం బాగా తగ్గిపోయి ఉంటుంది అనుకుంటాం. కానీ ఆ భావనే తప్పు అని తేలుతోంది. కరోనా భారతీయులు – మల్టీప్లెక్స్ల మధ్య దూరాన్ని పెంచింది. ఇక OTT వచ్చాక సినిమా థియేటర్ల శకం ముగిసిపోతుందేమో అనిపించింది. కానీ సినిమా ప్రేమికులకు ఏ గోడ అడ్డు రాలేదు. టీవీలో సినిమా వచ్చినా థియేటర్లో(Movie in Theaters) సినిమా చూసేంత తృప్తి ఉండదు అని వారు భావిస్తున్నారు. మునుపటి కంటే తక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నా.. కరోనా కాలంతో పోలిస్తే మనం సినిమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నామని తాజా లెక్కలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Movie in Theaters: థియేటర్ లో సినిమా.. ఆ కిక్కే వేరబ్బా అంటున్న జనం.. ఈ లెక్కలపై ఓ లుక్కేయండి!
టీవీలు..ఓటీటీలు కొత్త సినిమాలను తీసుకువచ్చేస్తున్నాయి. అయినాసరే..థియేటర్ కి వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గలేదని.. 2023లో థియేటర్ లో సినిమా చూసిన వారి సంఖ్య దాదాపు 16కోట్లు అని ఇటీవల ఒక రిపోర్ట్ చెబుతోంది. ఆ లెక్కలు ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకోవచ్చు.
Translate this News: