/rtv/media/media_files/2025/02/15/aXdjhHE8cVi9rOhZILpO.jpg)
ఆర్టీవో సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చౌటుప్పల్ లో చోటుచేసుకుంది. చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన సుర్వి అంజయ్య అనే వ్యక్తి 2019లో తంగడపల్లి గ్రామంలో 5 ఎకరాల 14 గుంటల భూమి కొనుగోలు చేశాడు.
అక్కడ 288 ప్లాట్లతో వెంచర్ చేసి అమ్మాడు. చౌటుప్పల్ హెచ్ఎండీఏ పరిధిలో ఉండడంతో నాలా కన్వర్షన్ చేసి హెచ్ఎండీఏ అనుమతితో ప్లాట్లను అమ్మాలి. అయితే నాలా కన్వర్షన్ లేకుండానే సబ్ రిజిస్ట్రారున్ ను మేనేజ్ చేసి కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశాడు అంజయ్య. అయితే మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలంటే నాలా కన్వర్షన్ చేయాల్సి ఉండడం, దీనికి పట్టాదారులే అప్లై చేయాల్సి రావడం, వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో సహకరించరని భావించాడు అంజయ్య.
Also read : Crime: భర్త పెళ్లికి రాలేదని భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత అతను మరీ ఘోరంగా!
ఆర్టీవో సంతకాలను పోర్జరీ చేసి
ఈ క్రమంలో హైదరాబాద్ లోని అయితగోని రాఘవేందర్ అనే వ్యక్తి ని సంప్రదించాడు అంజయ్య, గతంలో చౌటుప్పల్ ఆర్టీవోగా పనిచేసిన మహేందర్ రెడ్డి సంతకాలను పోర్జరీ చేసి, మిగిలిన ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేష న్ చేశాడు. ఇటీవల నిర్వహించిన భూముల ఎంక్వైరీలో భాగంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి వెంచర్ ను పరిశీలించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్లాట్లుగా చేసిన భూమికి రైతుబంధు పడుతుండడంతో అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించగా నాలా కన్వర్షన్ లేదని వెల్లడైంది. ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read: Delhi BJP : ఢిల్లీ సీఎం, మంత్రులు ఎవరు .. 15 మంది పేర్లు షార్ట్లిస్ట్!