Covid 2019: భారత్ లో కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పినదానికన్నా ఎక్కువట.. షాకింగ్ రిపోర్ట్! 

మనదేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య ప్రభుత్వం చెప్పేదానికన్నా ఎక్కువని ఒక రిపోర్ట్ చెబుతోంది. డెమోగ్రాఫర్లు, ఆర్ధిక వేత్తల రిపోర్టుల ఆధారంగా అల్జజీర షాకింగ్ లెక్కలను వెల్లడించింది. దీని ప్రకారం ప్రభుత్వం చెప్పేదానికన్నా 8 రెట్లు ఎక్కువగా భారత్ లో మరణాలు సంభవించాయి. 

New Update
Covid 2019: భారత్ లో కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పినదానికన్నా ఎక్కువట.. షాకింగ్ రిపోర్ట్! 

Covid 2019: భారతదేశంలో కరోనా మహమ్మారి మొదటి దశలో, 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది పెద్ద డెమోగ్రాఫర్‌లు (జనాభాను అధ్యయనం చేసేవారు) - ఆర్థికవేత్తల నివేదికలను ఉదాహరణగా చూపిస్తూ ఖతార్ మీడియా సంస్థ అల్జజీరా ఈ లెక్కలు చెప్పింది. ఈ రిపోర్ట్ ప్రకారం  2020లో భారతదేశంలో కరోనా మరణాలు ప్రభుత్వ గణాంకాల కంటే 8 రెట్లు ఎక్కువ. భారత ప్రభుత్వం ప్రకారం, 2020లో దాదాపు 1 లక్ష 48 వేల మంది కరోనా కారణంగా మరణించారు. కాగా కొత్త నివేదిక ప్రకారం వాస్తవ సంఖ్య 12 లక్షలు. ఈ డేటాను సైన్స్ అడ్వాన్స్ పబ్లికేషన్స్ జూలై 19 నాటి తన నివేదికలో ప్రచురించింది.  దీనిని భారత ప్రభుత్వం 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ఆధారంగా తయారు చేశారు. 

Covid 2019: నివేదికలో ఇచ్చిన గణాంకాలు WHO గణాంకాల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ రీసెర్చ్  ప్రకారం, అగ్రవర్ణ హిందువుల సగటు ఆయుర్దాయం 2020లో 1.3 సంవత్సరాలు తగ్గింది. అదే సమయంలో, షెడ్యూల్డ్ కులాల ప్రజల సగటు జీవన రేటు 2.7 సంవత్సరాలు క్షీణించింది. ఇది కాకుండా, భారతదేశంలోని ముస్లిం పౌరుల జీవిత రేటు మునుపటితో పోలిస్తే 5.4 సంవత్సరాలు తగ్గింది. కరోనా ప్రభావం పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవైపు పురుషుల సగటు ఆయుర్దాయం 2.1 సంవత్సరాలు తగ్గగా, స్త్రీల సగటు ఆయుర్దాయం 3 సంవత్సరాలు తగ్గిందని నివేదికలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే, పురుషుల జీవన రేటు మహిళల కంటే ఎక్కువగా క్షీణించింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020లో కరోనా మొదటి దశ, 2021లో డెల్టా వేవ్‌తో రెండవ దశ తర్వాత, దేశంలో మహమ్మారి కారణంగా 4.81 లక్షల మంది మరణించారు. తన నివేదికలో, WHO ఈ గణాంకాలను తప్పుగా పేర్కొంది.  వాస్తవానికి భారతదేశంలో 20-65 లక్షల మంది మరణించారని పేర్కొంది.  ఇది మొత్తం ప్రపంచంలోనే అత్యధికం.

WHO డేటాను ప్రభుత్వం తిరస్కరించింది,
Covid 2019: ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. డేటాను తీసుకున్న UN నమూనా తప్పు అని, దానిని భారతదేశానికి సరిగ్గా వర్తింపజేయలేమని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ లెక్కలు  కేవలం WHO నుండి మాత్రమే రాలేదు.  చాలా మంది ప్రజారోగ్య నిపుణులు - పరిశోధకులు కూడా భారత ప్రభుత్వ డేటా తప్పు అని పేర్కొన్నారు.

సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రభాత్ ఝా కూడా WHO గణాంకాలను సమర్థించారు. "మేము పొందిన డేటా ప్రకారం, భారతదేశంలో కోవిడ్ -19 కారణంగా సుమారు 40 లక్షల మంది మరణించారు. వీరిలో 30 లక్షల మంది డెల్టా వేవ్ కారణంగా మరణించారు." అని ఆయన చెప్పారు. 

కొత్త నివేదికపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే, దీని తర్వాత ప్రభుత్వ లెక్కలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Covid 2019: కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మరణించారు. కరోనాను  30 జనవరి 2020న గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. కోవిడ్ కారణంగా అమెరికాలో ఎక్కువ మంది చనిపోయారు. భారతదేశంలో దీని మొదటి కేసు 27 జనవరి 2020న కేరళలో బయటపడింది.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 4.45 కోట్లు (4,45,03,660). ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో రికవరీ రేటు 98.81%. ఇప్పటివరకు, భారతదేశంలో కోవిడ్ -19 కారణంగా 5 లక్షల 33 వేల 596 మంది మరణించారు.

Advertisment
తాజా కథనాలు