Khammam Farmer's Suicide: ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలాన్ని ఆక్రమించారని రైతు ఆవేదన చెందాడు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం రేవంత్రెడ్డి ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. రైతు కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుందని ధీమా ఇచ్చారు.
Also Read: కేసీఆర్కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఆఫీస్కు నోటీసులు!