CM Chandrababu: నేడు విశాఖ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను బరిలోకి దించింది వైసీపీ.

CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
New Update

CM Chandrababu: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఎలాగైనా ఆ ఎన్నికను గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సీటును ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపుతో ఎమ్మెల్సీ సీటూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దించింది వైసీపీ. అయితే కూటమి నుంచి ఎవరిని ఈ ఎన్నిక రేసులో సీఎం చంద్రబాబు పెడతారనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది. మరో ఈ స్థానంలో వైసీపీకి ఓటమి చెందితే విశాఖలో పట్టుకోల్పోతారు జగన్.

Also Read : సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన రద్దు.. సీఎంఓ క్లారిటీ

#ap-cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe