Visakhapatnam : మహిళల పై అగాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొందరు కామంధులు. తాజాగా విశాఖపట్నంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
ఎక్స్ రే కోసం వచ్చిన మహిళ పై అత్యాచరం..
విశాఖపట్నం రామ్ నగర్లోని కేర్ ఆస్పత్రిలో ఓ కామంధుడు రెచ్చిపోయాడు. ఎక్స్ రే కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ పై ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు దుర్మార్గుడు. ఎక్స్ రే తీయడానికి రూంలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని త్రీ టౌన్ పోలీసులకి అప్పగించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్త్తు చేస్తున్నారు.