/rtv/media/media_files/2026/02/17/uday-kiran-2026-02-17-08-07-13.jpg)
Uday Kiran
Uday Kiran: తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ ప్రారంభంలో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో ఘన విజయాలు సాధించి అభిమానులను సంతోషపరిచాడు.
కానీ తర్వాత కొన్ని సినిమాలు తన స్థాయిలో హిట్ కావడం లేదని, ఫెయిల్యూర్లోకి వెళ్లడంవల్ల అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గురించి సినీ ప్రముఖులు ఇంకా సంతాపంతో మాట్లాడుతుంటారు.
‘మనసంతా నువ్వే’ సినిమా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ తనకు ఎంత ఇష్టమైనవాడో, ఆత్మహత్యకు పాల్పడినందుకు జీవితాంతం ద్వేషిస్తానని, తనను క్షమించలేనని చెప్పారు.
After #AttarintikiDaredi became a big hit, Uday Kiran wanted to do a family entertainer again and spoke to V. N. Aditya for a story. But before the project could start, tragedy happened. Later, Aditya felt that doing action films like Jai Sriram didn’t really suit him. pic.twitter.com/biUOkQSecQ
— TELUGU FAB (@TELUGU_FAB) February 16, 2026
ఆదిత్య మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ఆరు రోజుల ముందు ఆయనకు ఫోన్ చేసి చాలా హుషారుగా మాట్లాడాడు. ఆ సమయంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా ఇండస్ట్రీలో హిట్ అయ్యిందని, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాంటెంట్ మంచి రియాక్షన్ పొందుతుందని, అటువంటి కథతో సినిమా చేయాలని చెప్పాడు.
అప్పట్లో ఉదయ్ కిరణ్ ‘జై శ్రీరాం’ లాంటి మాస్ యాక్షన్ మూవీ ఫ్లాప్ కావడంతో కొంచెం బాధలో ఉన్నప్పటికీ, ఫ్యామిలీ కథతో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా హిట్ చూసి సంతోషపడ్డాడని ఆదిత్య తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉదయ్ చాలా అణకువగా, హంబుల్గా ఉన్నాడని, సక్సెస్లో ఉన్నప్పటికీ తనను నియంత్రించుకున్నాడని వి.ఎన్.ఆదిత్య వెల్లడించారు. ఫెయిల్యూర్ తరువాత, తన పరిస్థితిని డీల్ చేయలేక ఆత్మహత్యకు పాల్పడడమే అత్యంత దుఃఖానుభూతి కలిగించే సంఘటన అని ఆయన తెలిపారు.
‘అత్తారింటికి దారేది’ హిట్ చూసి ఉదయ్ కిరణ్ ఎంత ఆనందపడ్డాడో, ఆ జోనర్లో సినిమాలు చేయాలనుకున్నాడు అని ‘మనసంతా నువ్వే’ సినిమా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య చెప్పిన మాటలు ఇప్పుడు అవుతున్నాయి.
Follow Us