Prabhas: చెన్నై టు ముంబై.. ఫ్లైట్‌లో ఫుడ్ తెప్పిస్తా: ప్రభాస్

ప్రభాస్‌కు భోజనం అంటే చాలా ఇష్టం. సెట్స్‌లో అందరికీ రుచికరమైన వంటలు పంపించడం ఆయన అలవాటు. ‘ఆదిపురుష్’ షూటింగ్ సమయంలో ఓం రౌత్‌కు చెన్నై వంటకాలు తినిపిస్తానని చెప్పి, నేరుగా చెన్నై నుంచి ఆహారం విమానంలో తెప్పించి ముంబై సెట్స్‌లో పెట్టారట.

New Update
Prabhas Food

Prabhas Food

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు భోజనం అంటే ఎంత ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు నచ్చిన వంటకాలు వస్తే ఎలాంటి పరిమితులు ఉండవు. షూటింగ్ సెట్స్‌లో సహనటులకు, సిబ్బందికి రుచికరమైన వంటకాలు పంపించడం ఆయనకు అలవాటే.

ఇంటివంటల నుంచి వివిధ రకాల వంటకాల వరకు పెద్దగా ఏర్పాట్లు చేసి అందరితో పంచుకోవడం ప్రభాస్ ప్రత్యేకత. ఆయనతో పని చేసిన వారు చాలాసార్లు “ప్రభాస్ పంపే భోజనం లెజెండరీ” అని చెప్పడం తెలిసిందే. అందరూ కడుపునిండా తినాలని చూసే పెద్ద మనసు ఆయనది.

Also Read: యష్ 'టాక్సిక్' టీజర్ రిలీజ్.. ధైర్యం ఉంటేనే చూడండి!!

Prabhas Food from Chennai to Mumbai

అయితే ఇటీవల ఆయన చెప్పిన ఒక సంఘటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో, దర్శకుడు ఓం రౌత్‌కు అసలైన చెన్నై వంటకాలు తినిపిస్తానని ప్రభాస్ మాట ఇచ్చారు. అది ఆయన చీట్ డే కావడంతో మరింత ప్రత్యేకంగా చేయాలని భావించారు.

అక్కడే వంటలు చేయించకుండా, నేరుగా చెన్నై నుంచే ఆహారం తెప్పించాలని నిర్ణయించారు. తాజాగా వండిన వంటకాలను చెన్నై నుంచి ఒక వ్యక్తి విమానంలో తీసుకుని వచ్చి, ముంబై సెట్స్‌కి అందజేశారట. అక్కడ మళ్లీ వేడి చేసి అందరికీ వడ్డించారు.

ఇది తెలిసిన ఓం రౌత్ పూర్తిగా షాక్ అయ్యారట. కేవలం లంచ్ కోసం ఒకరు రాష్ట్రం దాటి రావడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రభాస్ ఈ విషయం చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంత దూరం వెళ్లి తన ఇష్టమైన భోజనం తెప్పించుకోవడం, అదే సమయంలో ఇతరులతో పంచుకోవడం ప్రభాస్ స్టైల్ అని అభిమానులు అంటున్నారు. ఆయన ఫుడ్ లవ్ నిజంగా ఊహకు అందనిది అని మరోసారి ప్రూవ్ అయ్యింది. 

Advertisment
తాజా కథనాలు