మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

కృతి సనన్, కాజోల్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దో పత్తి'. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.

New Update

Do Patti Trailer:   బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, కాజోల్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్  'దో పత్తి'. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

ఇది కూడా చదవండి: నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా?

 'దో పత్తి' ట్రైలర్

ట్రైలర్ గమనిస్తే.. ఈ సినిమాలో కృతి ద్విపాత్రాభినయం చేయగా, కాజోల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది.  షహీర్ షేక్ కృతి బాయ్‌ఫ్రెండ్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. దాదాపు రెండున్నర నిమిషాల పాటు సాగే ఈ ట్రైలర్‌లో కాజోల్‌, కృతిల పవర్‌ఫుల్‌ గా కనిపించాయి.  ఈ సినిమా కథంతా మనాలి బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది.

Also Read :  దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే?

కవలలైన అక్కా చెల్లెళ్ల(కృతి)  మిస్టరీని, వారికి సంబంధించిన రహస్యాలను కాజోల్ ఎలా ఛేదించింది అనేదే ఈ సినిమా కథ. సస్పెన్స్, థ్రిల్, డ్రామాతో కూడిన ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ  'దో పత్తి' కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బ్లూ బటర్‌ ఫ్లై ఫిల్మ్స్‌ పతాకం పై  కృతి నిర్మించిన తొలి చిత్రం ఇది. ఈ మూవీలో తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర కాలా తదితరులు  కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో కృతి ప్రొడక్షన్ రంగంలోనూ అడుగుపెట్టింది. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్ -​ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

Also Read :  బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు