అమ్మ చెప్పే కథలు,కబుర్లు వింటూ ఆమె లాలనలో ఆదమరచి నిద్రపోయే పసితనం వారిది. నాన్న నడిపే బాటలో లోకాన్ని ఆకళింపు చేసుకునే బాల్యం వారిది. గురువులు బోధించే జ్ఞానంతో వెలిగే చిరుదివ్వెలు వారు. కానీ సమాజిక చీకటి క్రీనీడల్లో ఆ పసిమొగ్గలు వాడిపోతున్నాయ్. కొన్ని అసాంఘిక శక్తులు కాఠిన్యానికి వారి బాల్యం బలైపోతోంది.
పూర్తిగా చదవండి..“అమ్మా..చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి”..బాలల అక్రమరవాణాలో ఏపీ టాప్.!
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్నిపుర స్కరించుకుని కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్, గేమ్స్ 24 సెవన్ సంస్థలు భారత్లో బాలల అక్రమ రవాణా సమాచార విశ్లేషణ.. పేరిట నివేదిక విడుదల చేశాయి.దేశంలో బాలల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో..ఆంధ్రప్రదేశ్ ఒకటి. కోవిడ్ ముందుతో పోలిస్తే రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా ఘటనలు చాలా ఎక్కువయ్యాయి. 2016-20 మధ్య ఏపీలో బాలల అక్రమ రవాణాకు సంబంధించి 50 ఘటనలు చోటు చేసుకోగా.. 2021-22లో ఆ సంఖ్య ఏకంగా 210కు పెరిగింది. మనతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. 21 రాష్ట్రాల పరిధిలోని 262 జిల్లాల్లో చిన్నారుల అక్రమ తరలింపు కలవరపెడుతోంది. దాని ప్రకారం ఏపీలో కొవిడ్ తర్వాత అక్రమ రవాణాకు గురైన బాలల సంఖ్య సగటున 68 శాతం పెరిగిందని వివరించింది.
Translate this News: