/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-25T164124.311.jpg)
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని ప్రధాన వేదికల పేర్లను మార్పులు చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ సచివాలయ సిబ్బంది ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రపతి భవన్ ప్రజలకు అందుబాటులో ఉండేలా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభ్యర్థన మేరకు పేర్లు మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవనం భారతీయ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఇక్కడ ఉన్న ప్రధాన దర్బార్ హాల్ను జ్ఞానాంధ్ర మండపంగాను, అశోక్ హాల్ను అశోక్ మండపం గాను మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. దర్బార్ హాల్లో జాతీయ అవార్డుల వేడుక జరుగుతుందని వారు వివరించారు.