కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేశారు. రాజీనామా చేయించి ఎంఎల్ఏ లను పార్టీలో చేర్చుకోవాలనేదే మా పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ చెబుతోందన్నారు.
పార్టీ మారే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే 26కు 26 తామే గెలుస్తామన్నారు. ఎన్నికలు ఉండవు కాబట్టే కేశవ రావుతో రాజీనామా చేయించారన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఉద్యోగాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు. నిరుద్యోగుల ఇష్యూ డైవర్ట్ చేయడానికే ఎమ్మెల్యేల చేరిక అంశం తెరమీదకి తెచ్చారని ధ్వజమెత్తారు.