కుటుంబ సమేతంగా సీఎమ్ కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం...ఎందుకంటే...!?

కళ్లతోనే కామెడీని పలికించగల హాస్యదిగ్గజం, టాలీవుడ్ మీమ్స్ మహారాజు బ్రహ్మానందం శనివారం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లారు. తన చిన్న కొడుకుడు సిద్ధార్థ్ పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.న కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను బ్రహ్మానందం దంపతులు కేసీఆర్-శోభ దంపతులకు అందజేశారు.హైదరాబాద్‌లో జరగబోయే కళ్యాణమహోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని బ్రహ్మానందం కేసీఆర్‌ను కోరారు.ఈ సందర్భంగా బ్రహ్మిదంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

New Update
కుటుంబ సమేతంగా సీఎమ్ కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం...ఎందుకంటే...!?

కళ్లతోనే కామెడీని పలికించగల హాస్యదిగ్గజం, టాలీవుడ్ మీమ్స్ మహారాజు బ్రహ్మానందం శనివారం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లారు. తన చిన్న కొడుకుడు సిద్ధార్థ్ పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.

publive-image

తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను బ్రహ్మానందం దంపతులు కేసీఆర్-శోభ దంపతులకు అందజేశారు.హైదరాబాద్‌లో జరగబోయే కళ్యాణమహోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని బ్రహ్మానందం కేసీఆర్‌ను కోరారు.ఈ సందర్భంగా బ్రహ్మిదంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ అడపాదడపా సినిమాల్లో మెరిశారు. ప్రస్తుతం గౌతమ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక రెండో కుమారుడు,కాబోయే పెళ్లికుమారుడు సిద్ధార్థ్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. తొలి నుంచీ సిద్దార్థ్ సినిమాలకు దూరంగానే ఉన్నారు.

విదేశాల్లో చదువుకుని ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మే 21న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇప్పుడు పరిణయ తరుణం ముంచుకొస్తున్నందున బ్రహ్మానందం పెళ్లిపనుల్లో బిజీగా ఉన్నారు.అయితే, పెళ్లి ఏ తేదీన జరగబోతుందన్న విషయంపై సమాచారం లేదు.

2012 అక్టోబర్ 24న దసరా పండుగ రోజున హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ‌లో పెద్ద కుమారుడు గౌతమ్ కి జ్యోత్స్నరెడ్డితో వివాహమయ్యింది. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి కుమార్తె. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు సంతానం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Single Movie Collections: దిమ్మ తిరిగేలా 'సింగల్' కలెక్షన్స్.. రెండు వారాల్లో ఎన్ని కోట్లంటే..?

శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ మూవీ మే 9న విడుదలై సెన్సేషనల్ సక్సెస్‌గా నిలిచింది. బుక్ మై షోలో ఒక్క శనివారం రోజే 32,460 టికెట్లు అమ్ముడవ్వగా, ఇప్పటివరకు ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి రెండో వారం కూడా అదే జోష్‌తో థియేటర్లలో రన్ అవుతోంది.

New Update

Single Movie Collections: యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’ సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, తొలి వారంలోనే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లగా, ఇప్పుడు రెండో వారం గడుస్తున్నా అదే జోష్‌ను కొనసాగిస్తోంది. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, శనివారం ఒక్క రోజులోనే బుక్ మై షో ద్వారా 32,460 టికెట్లు అమ్ముడవ్వడంతో సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏ లెవెల్ లో ఉందొ తెలుస్తోంది. 

Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!

రూ. 25 కోట్ల గ్రాస్

ఇప్పటికే ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 15 కోట్లు, ఇతర ప్రాంతాల నుంచి మరో రూ. 7 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఆదివారం మరింత బిజీగా ఉండే అవకాశం ఉండటంతో, ఈ వారం చివరికి రికార్డు కలెక్షన్స్ రాబడుతుందని అంచనా..

కేవలం కామెడీ ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్‌ మాత్రమే కాకుండా, ‘సింగిల్’ ఓ యూత్‌ఫుల్ ఎమోషనల్ జర్నీగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఒక సాధారణ యువకుడి జీవితం, ప్రేమ కథ, తను ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ హాస్యం, భావోద్వేగాలతో మిక్స్‌ చేస్తూ అందంగా తీసిన  ఈ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

శ్రీ విష్ణు నటన ఈ సినిమాలో హైలైట్‌గా నిలవగా, కేతికా శర్మ, ఇవనా, వెన్నెల కిషోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక సినిమాకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ట్యూన్స్‌కి యూత్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సింపుల్ కాన్సెప్ట్‌తోనే ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

Also Read: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

'సింగిల్'తో పాటు విడుదలైన ఇతర సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీకి క్రేజ్ మరింతగా పెరిగింది. బ్రేక్ ఈవెన్ ఇప్పటికే పూర్తయిందనీ, డిస్ట్రిబ్యూటర్లకు అన్ని ఏరియాల్లోనూ ప్రాఫిట్స్ వస్తున్నాయి తెలుస్తోంది.

మొత్తానికి, ‘సింగిల్’ సినిమా శ్రీ విష్ణు కెరీర్‌లో మరో హిట్ గా నిలుస్తోంది. శ్రీ విష్ణు మినిమం గ్యారెంటీ హీరో అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే!

Also Read: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!

Advertisment
Advertisment
Advertisment