హనుమంతుడికి మొక్కినా.. కేసీఆర్‌ను ఇంటికి పంపుతం..

హనుమంతుడి సాక్షిగా కేసీఆర్‌ను ఇంటికి పంపుడు ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్నారు. పదేళ్లుగా విసిగిపోయిన ప్రజలంతా దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

హనుమంతుడికి మొక్కినా.. కేసీఆర్‌ను ఇంటికి పంపుతం..
New Update

హనుమంతుడి సాక్షిగా కేసీఆర్‌ను ఇంటికి పంపుడు ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గురువారం నాడు దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామంలోని హనుమంతుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలోని నిరుద్యోగులు, రైతన్నలు, పేదల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని మండిపడ్డారు. ఎందుకోసమైతే కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ కలలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్నారు. పదేళ్లుగా విసిగిపోయిన ప్రజలంతా దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపాలని తాను హనుమంతుడిని ప్రార్థించినట్లు రఘునందనరావు తెలిపారు.

#telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe