Keerthi: దేవుడికి పూజలు ఎందుకు చేయాలి.. బిగ్ బాస్ ఫేమ్ కీర్తి షాకింగ్ కామెంట్స్

దేశంలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడని, అలాంటప్పుడు ఆయనకు పూజలు ఎందుకు చేయాలని ప్రశ్నించింది బిగ్ బాస్ ఫేమ్ కీర్తి. శివరాత్రి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Keerthi: దేవుడికి పూజలు ఎందుకు చేయాలి.. బిగ్ బాస్ ఫేమ్ కీర్తి షాకింగ్ కామెంట్స్
New Update

Bigg Boss fame Keerthi: బిగ్‌ బాస్‌ ఫేం, సీరియల్ యాక్టర్ నటి కీర్తి భట్‌ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశంలో పసిపిల్లలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడని, అలాంటప్పుడు ఆయనకు పూజలు ఎందుకు చేయాలని అంటూ శివరాత్రి రోజు ఓ వీడియో షేర్ చేసింది. చిన్నారులపై రేప్‌లు జరుగుతుంటే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్‌ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.

మనం ప్రతి రోజు దేవుడిని వేడుకుంటామని.. శివరాత్రి అనే కాదు.. ఎప్పుడైన అందరు బాగుండాలని.. మంచి జరగాలనే దేవుడికి పూజాలు చేస్తామని.. కానీ దేశంలో మహిళలపై ఆరాచాకాలు, అఘాత్యాలు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఒక చిన్నారిని గ్యాంగ్ రేప్ చేశారని.. అప్పుడు కూడా ఆ దేవుడు చూస్తూ ఊరుకున్నాడని.. పెద్దవాళ్లు అయితే ఏదో ఒకళా తప్పించుకోవడం వంటివి చేస్తారు కానీ.. అదీ చిన్న పిల్లా.. అంతమంది క్రూరంగా దానిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

publive-image

ఇలాంటి ఘటనలను దేవుడు ఆపకుండా ఏం చేస్తున్నాడని ప్రశ్నించింది. ఆ సమయంలో ఆ చిన్నారి ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది..రేప్ నుంచి తప్పించుకునేలా ఆ దేవుడు ఎవరోకరి రూపంలో సమయం చేయాలి కదా.. అలా కాకుండా ఆ చిన్నారికి అలాంటి ఘటనే ఎదురవకుండ చూడాలి కదా అని వాపోయింది. కనీసం తప్పించుకోవడానికైనా సాయం చేయొచ్చు కదా.. అలాంటి టైంలో కాపాడలేని దేవుడు ఎందుకని పేర్కొంది. పసిపిల్లలంటే దేవునితో సమానం అంటారు కదా.. మరి ఆ పసిపిల్లలపై రేప్‌లు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు?.. ఇందుకేనా రోజు దేవుడికి పూజలు చేయాలి? ..ఇది చాలా దారుణం కదా.. ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడే లేడని అనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

publive-image

పేదవాళ్లు పేదవాళ్లగానే ఉంటున్నారని, ధనికులు మరింత ధనవంతులను అవుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కొందరు కీర్తిని సపోర్టు చేస్తుంటే.. మరికొందరు మాత్రం దేవుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా..కీర్తి తన కుటుంబ సభ్యులందరిని యాక్సిడెంట్ లో కోల్పోయిన సంగతి తెలిసిందే. అమ్మ, నాన్న, అన్న, వదిన.. అన్న పిల్లలు మొత్తం చనిపోగా.. కీర్తి ఒక్కతే తీవ్ర గాయాలతో బ్రతికి బయటపడింది.

publive-image

అయితే ఆ ప్రమాదంలో ఆమె కడుపుకి బలమైన గాయం తగలడంతో ఆమెకు ఆపరేషన్ చేసి..గర్భసంచి తీసేశారు. ఈ  విషయం తెలిసిన కూడా ఆమెను రియల్ హీరో కార్తీక్ భార్యగా పొందటానికి అంగీకరించాడు. కీర్తిని మనస్పూర్తి ప్రేమించి.. తన పేరెంట్స్‌ని ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధమయ్యాడు. రిసెంట్ గా వీరిద్దరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.

#bigg-boss-fame-keerthi #keerthi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe