TS: గాడిద దొంగతనం చేశానని కేసు.. బీఆర్ఎస్ ను వదిలిపెట్టం: బల్మూర్ వెంకట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పక్కా ఆధారాలు తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రావాలని క్రిశాంక్ కు సవాల్ విసిరారు.

TS: గాడిద దొంగతనం చేశానని కేసు.. బీఆర్ఎస్ ను వదిలిపెట్టం: బల్మూర్ వెంకట్
New Update

B Venkat: బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు అనుములు, ఎనుములకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గురువారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కార్పొరేషన్ చైర్మన్ లు ప్రీతమ్, మెట్టుసాయి,అధికారం ప్రతినిధి లింగం యాదవ్, యూత్ కాంగ్రెస్ నేత రాజీవ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిశాంక్ ఇష్యూపై బల్మూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకొము..

ఈ మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా లీడర్ క్రిశాంక్ చిత్రపురి సొసైటీ లో జరిగిన అవినీతిని సీఎం గారికి అంటగట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో సీఎంకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. ఎప్పుడైనా రేవంత్ సోదరులో మహేంద్ర రెడ్డి అనే పేరు విన్నారా? నిజంగా మీ దగ్గర ఆధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వండి. తప్పకుండా వారిపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నిజంగా తప్పు చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు. కానీ అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకొము. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రభుత్వం నడిపినపుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు తాము ఏమి చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో మీడియాను ,సోషల్ మీడియాను బీఆర్ఎస్ కేసీఆర్ ఎలా అణిచివేశారో అందరికి తెలుసన్నారు.

గాడిద ఎత్తుకెళ్లిన కేసు..

అలాగే హుజురాబాద్ లో తన ఫోన్ తీసుకొని కేస్ పెట్టింది మర్చిపోయారా అంటూ గుర్తు చేశారు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరిన మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన సంఘటన అప్పుడే మర్చిపోయారా? ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతారని ధర్నా చౌక్ ఎత్తేసిన్నపుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్లోకి వచ్చి అరెస్ట్ లు చేసిన సంఘటనలు మర్చిపోయారా? నేను మాజీ సీఎం కేసీఆర్ గారి పుట్టిన రోజు చేస్తే.. ఒక గాడిదకు ఫొటో వేస్తే గాడిద దొంగతనం జరిగిందని సుమోటోగా కేసులు పెట్టారు. నేను చేసిన కార్యక్రమం ఒకదగ్గరైతే సుమోటోగా రెండు చోట్లా కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఒక అధికారి ఇంటిపై రూమ్ లో లాక్ చేసి పెట్టారు. ఈ రోజు మీ పోస్ట్ పై ఫిర్యాదు చేస్తూ పోలీసులు వారిపని వారు చేశారు. మాది ప్రజా ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ల కాదు. తప్పు చేసింది ఎవరైనా ఉరుకొము. ఆధారాలతో రండి ఊరికే బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఉరుకొము. మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ లుగా ఉన్నాం.. ఏమైనా మాట్లాడొచ్చు అంటే కుదరదు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు తనపని తను చేసుకుపోతుంది. భజనలు చేయడం మానుకోండి అని హెచ్చరించారు.

అమరవీరుల స్థూపం వద్దకు రండి..

ఇక అనవసరంగా సీఎం రేవంత్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు. క్రిశాంక్ అన్న మీరు ఎప్పుడు మాలగా చెప్పలేదు. నేను మీడియా ముందు చెప్తున్నా.. ఆధారాలు తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రండి. డీజీపీ ఆఫీస్ కు వెళ్దాం. ఎవరు తప్పు చేసిన చర్యలు తీసుకుంటారు. క్రిశాంక్ అన్న కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇద్దరం కలిసి ఉద్యమాలు చేస్తే ఇద్దరి పై కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా? అవస్తవాలు చెప్పడం మానుకోండి. మీరు కేటీఆర్, కవిత ఆ కుటుంబం మెప్పు పొందాలనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోయిన జరిగిందని చెప్పుకోండి. మీకు కావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇలా మా ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం మానుకోండి. సీఎం గారిపై అనవసరంగా ఆరోపణలు చేయకండి. ఇలా అనవసరమైన ఆరోపణలు సోషల్ మీడియాలో చేస్తే ప్రభుత్వం తన పని తాను చేస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

#balmur-venkat #brs-social-media
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe