Bala Krishna: బాలయ్య ఎన్నికల ప్రచారం.. ఫుల్ జోష్ లో తెలుగు తుమ్ముళ్లు..!

హిందూపూర్ నియోజకవర్గం లేపాక్షి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సడ్లపల్లి, పూలమతి, సిరివరం గ్రామాలలో ఎన్నికల చైతన్య రథంపై రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

New Update
Bala Krishna: బాలయ్య ఎన్నికల ప్రచారం.. ఫుల్ జోష్ లో తెలుగు తుమ్ముళ్లు..!

MLA Bala Krishna:  హిందూపూర్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ లేపాక్షి మండలంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సడ్లపల్లి, పూలమతి, మానేపల్లి, సిరివరం గ్రామాలలో ఎన్నికల చైతన్య రథంపై రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

Also Read: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!

ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఆయా ప్రాంతాలలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి, రాజకీయ చైతన్యవంతులను చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదని పేర్కొన్నారు.

Also Read: ఏం తప్పుగా మాట్లాడాను?.. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ..!

ఆయన ఆశయానికి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు ప్రజాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు, వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

Advertisment
తాజా కథనాలు