Telangana Free Bus Scheme: తెలంగాణలో రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల (Congress Six Guarantees) హామీలను నెరవేర్చే క్రమంలో ముందుగా మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే . మహాలక్ష్మీ పథకంలో (Mahalaxmi Scheme) భాగంగా అమలు చేసిన ఈ ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోంది.అదే విధంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. ఉచితం కావడంతో ఆర్టీసీ కి ఆక్యుపెన్సీ రేటు కూడా విపరీతంగా పెరగడం. బస్సుల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉండటం .. అన్ని సీట్లలో మహిళలే కూర్చోవడంతో పురుషులు నిల్చొనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఉచిత ప్రయాణం కోసం జారీ చేసిన జీఓ 47ను రద్దు
చాలా రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో నాగోలుకు చెందిన హరిందర్ అనే వ్యక్తి హైకోర్టులో (TS High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ .. ఉచిత ప్రయాణం కోసం జారీ చేసిన జీఓ 47ను (G.O 47) రద్దు చేయాలని కోరాడు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్రరద్దీ పెరిగిందని,కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదన్న హరిందర్ దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొనడం జరిగింది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటీషన్లో ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది. పిటీషనర్ ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారన్న ధర్మాసనం..ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించి , తదుపరి విచారణను రెండు వారాల కు వాయిదా వేసింది.
ఆరు గ్యారెంటీల అర్హుల ఎంపిక ప్రక్రియ