భార్యభర్తల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో కోపంతో ఊగిపోయిన నాగశివ తన భార్య నాగమణిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరులో చోటు చేసుకుంది. మహిళ కేకలు విన్న స్థానికులు ప్రమాద స్థలికి వచ్చి చూసే సరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..ఉయ్యూరులో దారుణం.. భార్యను కత్తితో పొడిచిన భర్త
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది. నాగమణిపై ఆమె భర్త కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Translate this News: