Atchannaidu: CECకి అచ్చెన్నాయుడు ఫిర్యాదులు

CECకి రెండు లేఖలు రాశారు అచ్చెన్నాయుడు. టీడీపీ అభ్యర్థులను వేధిస్తానంటూ MLC దువ్వాడ శ్రీనివాస్‌ అంటున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే, రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
TDP: వారిపై కఠిన చర్యలు తీసుకోండి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు లేఖ..!

TDP Atchannaidu: ఎన్నికల ప్రధానాధికారికి రెండు లేఖలు రాశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సీఈసీకి  ఫిర్యాదు చేశారు. 2021-22 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అక్రమల కేసులు పెట్టి అరెస్టు చేయించాడని.. ఇప్పుడు అదే పునరావృతం చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నాడని పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: పామిడి వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు..ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న సీనియర్ నేత..!

అలాగే రాజకీయ ప్రచారంలో సచివాలయ వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీకి మరో లేఖ రాశారు. ఎన్నికల కార్యకలాపాల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించిందని..కానీ వైసీపీ ప్రభుత్వం తరుపున వాలంటీర్లు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారని లేఖలో వెల్లడించారు. వాలంటీర్లు తన సైన్యం అంటూ ముఖ్యమంత్రి అభివర్ణించారన్నారు.

Also Read: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్

పోస్టల్ బ్యాలెట్లను ఎంచుకునే సీనియర్ సిటిజన్లకు దరఖాస్తులను సులభతర చేయమని వాలంటీర్లకు చెప్పిన మంత్రి ధర్మనపై కూడా అచ్చెన్న ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారాలకు సహకరించాలని వాలంటీర్లకు 15 రోజులుగా వైసీపీ నాయకులు డబ్బు, బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఇస్తున్నందున రాజకీయ ప్రచారం చేయడం అనైతికం అంటూ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అత్యవసర అంశంగా పరిగణలోనికి తీసుకొని రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయాన్ని నిషేధించాలని అచ్చెన్న కోరారు.

Advertisment
తాజా కథనాలు