Atchannaidu: ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నా లేఖలు..!

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

New Update
Atchannaidu: ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నా లేఖలు..!

Atchannaidu: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMS ను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదీనంలోకి తీసుకుందన్నారు.

Also Read: రూ. 10 కోట్ల విరాళం అందించిన పవన్ కళ్యాణ్

సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్‌లకు CFMS ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కార్యాలయం నుంచే అనేక చెల్లింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. వెంటనే ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.

Also Read: వైసీపీ ప్రచార సామాగ్రి సీజ్.. దాదాపు 2 కోట్ల డబ్బు.. ఆందోళన చేపట్టిన టీడీపీ

ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుజయ్ రెడ్డిలను తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఈసీని కోరారు.  ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా ఇంకా ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ ఫోటో ఉండటంపై అచ్చెన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్‌లో సంక్షేమ పథకాలపై చారిత్రక సమాచారం ఉందన్నారు. సీఎంకు సంబంధించి అన్ని ఫోటోలు, సంక్షేమ పథకాల సమాచారం ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తొలగించాలన్నారు. ఎన్నికల కోడ్‌ను విస్మరించినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు