AP: విద్యార్థులను వేధిస్తున్న ఏఎన్ఎం, వార్డెన్

అల్లూరి సీతారామరాజు జిల్లా బోదులూరు బాలికల పాఠశాలలో ఏఎన్ఎం. రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ విద్యార్థులను వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వారి నివాస గృహాల్లో అంట్లు తోమించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం వంటి చాకిరి చేయించుకుంటున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
AP: విద్యార్థులను వేధిస్తున్న ఏఎన్ఎం, వార్డెన్

ASR District: విద్యార్థులకు సంరక్షణగా ఉండాల్సిన ఏఎన్ఎం, వార్డెన్ వెట్టిచాకరీ చేయిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏ.ఎన్.ఎం. రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన బయటపడింది.

Also Read: దిశ పోలీస్ స్టేష‌న్ల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..!

తామర, గజ్జి ఉంది అనే నెపంతో తమ వస్త్రాలను విప్పించి ఇనుప గొట్టాలతో, బెత్తాలతో కొడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, తమ తల్లిదండ్రులను సైతం విమర్శిస్తున్నారని వాపోయారు. మీరు కొండల్లో చేతబడి కలిగినటువంటి వారు, చదివి ఏం సాధిస్తారు అని తమను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని విద్యార్థులు వారి బాధను చెప్పుకున్నారు.

Also Read: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..!

పడుకునే సమయంలో వారి కాళ్లు నొక్కాలని, అంతేకాకుండా వారి నివాస గృహాల్లో అంట్లు తోమించుకోవడం బట్టలు ఉతికించుకోవడం వంటి చాకిరి చేయించుకుంటున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఈ ఏఎన్ఎం రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ వద్దంటూ ప్రధాన ఉపాధ్యాయురాలు దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి స్పందన లేదని విద్యార్థులు చెప్తున్నారు.

Advertisment
తాజా కథనాలు