Sharmila: విజయవాడలో ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్?

విజయవాడలో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

New Update
Sharmila: విజయవాడలో ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్?

Sharmila: విజయవాడలో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆంధ్రరాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని.. డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఆత్మహత్యలా..హత్యలా..?

ఆంధ్రప్రదేశ్ లో 21 వేల మంది బిడ్డలు చేసుకునేందుకు పనిలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక సర్వే పేర్కొందని తెలిపారు. ఇవి నిజంగానే ఆత్మహత్యలా ప్రభుత్వం చేస్తున్న హత్యలా..?..డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలు సంవత్సరానికి 500 మంది చనిపోతున్నారంటే ఇది నిజంగానే ప్రత్యేక హోదా రాక మనం చేతులారా చేసుకున్న పాపం కాదా..? ఇక్కడి బిడ్డలు వలసలు పోయి యువతే లేని రాష్ట్రంగా తయారవదా..? కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు అంది..కనీసం లక్షమందికైనా ఉద్యోగాలు ఇచ్చారా..?  బీజేపీ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర బిడ్డలను మోసం చేసినట్టు కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించింది.

ఆంక్షలు ఎందుకు..?

5ఏండ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు లక్ష 43వేల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టి దిగిపోయారని.. ఆ తర్వాత వచ్చిన జగనన్న 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. అయితే, అధికారంలోకి వచ్చాక మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్ లు ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబుని 7వేల ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగిన జగన్ ఇప్పుడు చేస్తున్నది ఎంటి..? అని ప్రశ్నించారు. 'కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తే పాపమా..? ఈ రోజు ఛలో సెక్రెటెరియట్ కు ఇన్ని ఆంక్షలు ఎందుకు..? ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా..?జర్నలిస్టులను గొడ్డును బాదినట్టు బాదుతున్నారు..ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం?. గత రెండు రోజులుగా పోలీసులు హై అలర్ట్ లో ఉండి మమ్మల్ని నియంత్రిస్తున్నారు..ఎన్ఎస్ యూఐ ని గత పదిరోజులుగా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Also Read: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!

ఐదేండ్లు ఏం చేశారు..?

జర్నలిస్టులను చితకబాదుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారన్నట్టే కదా..? జాబ్ నోటిఫికేషన్ ల వరద పారిస్తామని చెప్పారు జగనన్న.. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా..? 23వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ అన్నారు.. 5 ఏండ్లు అయ్యింది మీరు అధికారంలోకి వచ్చి ఏం తీసుకువచ్చారు?. బాబు పోవాలి జాబ్ రావాలన్న నినాదం మీది కాదా..? దేవుని దయ అన్నారు.. దేవుని దయతో అధికారంలోకి వచ్చారు. మరి ఏం చేశారు..? ఒక్క రోజైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా..? ఉద్యోగాలు, పరిశ్రమలు కూడా రాలేదు. ఒప్పుకున్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సిన అవసరం మీకు లేదా..? ఈ ఐదేండ్లు ఏం చేశారు..? అని దుమ్మెత్తిపోశారు.

దగా డీఎస్సీ

ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు నోటిఫికేషన్ వేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ వేశారు. డీఎస్సీకి కనీసం 150 పుస్తకాలు చదవాలి. గడువు ఉన్నది 26 రోజులు మాత్రమే. మా మీద మానసిక ఒత్తిడి ఉందని ఓ బిడ్డ చెప్పాడు. లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని జగనన్న చెబుతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అందులో ఉన్నాయట. లక్ష 21వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయంలో వాళ్ల సైన్యం కోసం ఇచ్చుకున్న ఉద్యోగాలు. ఆర్టీసీని విలీనం చేస్తే వచ్చినవి 51వేల ఉద్యోగాలు. 2లక్షల 30వేల ఉద్యోగాలు ఈ రోజుకీ ఖాళీగానే ఉన్నాయి. 2,557 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు భర్తీ చేశారు. 6లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గు ఉండాలి అని ధ్వజమెత్తారు. 7వేల ఉద్యోగాలు ఎందుకు వేస్తున్నారని 6వేల ఉద్యోగాలు వేస్తున్నారు.. మీకన్నా చంద్రబాబు గారే మేలు కదా..? మాట తప్పము మడమ తిప్పమన్నారు. ఇదేనా వైయస్ఆర్ వారసత్వం అంటే..? నవరత్నాలు, జాతిరత్నాలు ఏమయ్యాయి..? మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలని 30వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు