CMRF కు విరాళాల వెల్లువ

వరద బాధితుల కోసం పర్చూరు నియోజకర్గం గొనసపూడికి చెందిన విక్రం నారాయణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా సహాయం అందించారు. ఈ రోజు చంద్రబాబును కలిసిన నారాయణ కుటుంబ సభ్యులు రూ.1,55,55,555 చెక్కును అందించారు.

New Update
Chandrababu CMRF

వరద బాధితులను అండగా నిలిచి, ఆదుకునేందుకు భారీగా దాతలు ముందుకు వస్తున్నారు. సీఎం చంద్రబాబును కలిసి అనేక మంది తమ విరాళాలను సమర్పిస్తున్నారు. తాజాగా పర్చూరు నియోజకర్గం గొనసపూడికి చెందిన విక్రం నారాయణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా సహాయం అందించారు. ఈ రోజు చంద్రబాబును కలిసిన నారాయణ కుటుంబ సభ్యులు రూ.1,55,55,555 చెక్కును అందించారు. వరద బాధిత కుటుంబాలకు, ప్రభుత్వానికి అండగా నిలిచి విక్రం నారాయణ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సైతం వీరిని అభినందించారు.

విక్రం నారాయణ రావు మాట్లాడుతూ.. తాము కూడా ఒకప్పుడు విజయవాడ సింగ్ నగర్ లో ఉండేవాళ్లమన్నారు. విజయవాడ, సింగ్ నగర్ తో తమకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రజలకు తమ వంతుగా సహాయం చేయాలని ముందుకు వచ్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ కుటుంబం ఎల్లప్పుడు తోడుగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు. నారాయణ కుటుంబం ముంబై ఫార్మాస్యూటికల్ కంపెనీని నిర్వహిస్తోంది.

Advertisment
తాజా కథనాలు