Nara Bhuvaneshwari: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి!

మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదన్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు భువనేశ్వరి.

New Update
Nara Bhuvaneshwari: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి!

Chandrababu arrest row: తన భర్త చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu arrest)ని నిరసిస్తూ ఒక్క రోజు సత్యాగ్రహ దీక్ష చేసిన నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తన దీక్షను విరమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajamahendravaram)లో చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకున్నారు భువనేశ్వరి.

publive-image దీక్ష విరమించిన నారా భువనేశ్వరి

నారా భువనేశ్వరి ఏం అన్నారంటే:

➼ చంద్రబాబు నా ఆయుషు కూడా పోసుకుని బతికి ప్రజలుకి సేవ చేయాలి

➼ ఈ దీక్ష ప్రజలు కోసం చేస్తున్నాను

➼ నా తండ్రి, భర్త ఎప్పుడు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదు, మాకు ఆ అలవాటు లేదు

➼ మేము నలుగురుము నాలుగు దిక్కులు అయిపోయాం

➼ మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు

➼ చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక చనిపోయిన 105 కుటుంబాలును నేను పరామర్శిస్తాను. వారికి అండగా ఉంటాను

➼ అవసరం అయినప్పుడు ప్రజలుతో ఉంటాను, పోరాటం చేస్తాను

➼ గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు.

➼ త‌ప్పు చేయ‌ని మేం అందరం జైలుకు వెళ్లినా మాకు బాధలేదు… పార్టీని నడిపించే కార్యకర్తలు మాకున్నారు… వాళ్లే పార్టీని ముందుకు తీసుకెళతారు.

అందరికి కృతజ్ఞతలు:
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు భువనేశ్వరి. నాడు తెల్లదొరలపై పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదు. ఆయన ఎంతో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జైలు నుంచి బయటికి వచ్చాక ప్రజలతో కలిసి మళ్లీ పోరాడారన్నారు భువనేశ్వరి. ఈ దీక్షలో తాను పాల్గొన్నది చంద్రబాబు కోసమో, తమ కుటుంబం కోసమో కాదని.. ప్రజల కోసమన్నారు భువనేశ్వరి. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తడానికి ఈ దీక్షలో పాల్గొన్నానని చెప్పారు. మరోవైపు నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయలసీమలోని కుప్పంలో అక్టోబర్ 5న యాత్ర ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఫలితాన్ని బట్టి తేదీ మారవచ్చు. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే మకాం వేసి వివిధ నిరసనల్లో పాల్గొంటున్నారు. బయటి నుంచి చంద్రబాబుకు ఇచ్చే ఆహారాన్ని ఆమె జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ప్రతి వారం ఆయనను కలుస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. తన తండ్రి ఎన్టీ రామారావు, భర్త చంద్రబాబు నాయుడు రెండు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ భువనేశ్వరి ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు, సచివాలయంలో కాలు పెట్టలేదు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత భువనేశ్వరి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపిస్తున్నారు.

ALSO READ: తెలంగాణలో పోటీకి జనసేన సై.. 32 స్థానాలతో లిస్ట్ రిలీజ్!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: ఏపీలో విషాదం.. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి

కాకినాడలోని రేచర్లపేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి చెందారు. మృతురాలు రమ్యదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
 kakinada crime news

kakinada crime news

Kakinada Crime News: కాకినాడ నగరంలోని రేచర్లపేట ప్రాంతంలో తల్లి, కుమారుడి అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. ఒకే గదిలో మృతదేహాలు కనిపించడంతో  అంతా ఆందోళనకు గురయ్యారు. మృతులు రమ్యదీప్తి, ఆమె నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్‌ అని గుర్తించారు. రమ్యదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఆమె కుమారుడు ప్రశాంత్‌ మృతి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అనుమాన స్థితిలో తల్లి, కుమాడు మృతి:

చిన్నారి చేతులు, కాళ్లు, నోరు, ముక్కు అన్నింటికీ ప్లాస్టర్లు అంటించి ఉండడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయి.  అయితే తల్లి, కూమాడిని ఎవరైనా హత్య చేశారా..?  లేక ఆత్మహత్య  చేసుకున్నా  అనే కోణంలో విచారణ చేస్తున్నారు. రమ్యదీప్తి రెండు నెలల క్రితం అబుదాబి నుంచి భారత్‌కు వచ్చినట్టు సమాచారం. ఆమె భర్త శరత్‌బాబు ప్రస్తుతం గల్ఫ్‌లోనే ఉంటున్నారు. కుటుంబంలోని పరిస్థితులు, భార్యాభర్తల మధ్య పరస్పర సంబంధాలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు.

ఇది కూడా చదవండి: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

తల్లి, బాలుడి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురైతున్నారు. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, అనుబంధాల్లో బలహీనతలతో ఇలాంటి ఘోర పరిణామాలు ఏమైనా ఉన్నాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పూర్తి నిజాలు బయటకు తీయాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

(AP Crime | ap-crime-news | ap crime latest updates | ap crime updates | Latest News | telugu-news )

ఇది కూడా చదవండి: 
ఆరోగ్యకరమైన భోజనం తినడానికి సమయం లేదా? వీటితో మీ ప్రాబ్లం సాల్వ్

Advertisment
Advertisment