సీజన్ ఎలా వస్తుందో..సంబంధిత వ్యాధులు అలానే వస్తాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, కాలువలు నిండడంతో ఈగలు,దోమలు,కీటకాలు వగైరా వ్యాధికారకాలు పుట్టుకొస్తాయి. దీంతో జనం జబ్బుబారిన పడతారు. అయితే ఈ సీజనల్ వ్యాధులకు నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపలను సీన్లోకి దించింది.
పూర్తిగా చదవండి..జ్వరాలకు చేపలతో చెక్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం
సీజనల్ వ్యాధులకు నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపలను సీన్లోకి దించింది. టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరాలను నిలువరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం సుమారు కోటి గంబూసియా చేపలను చెరువు,కుంటలు,కాలువలు,కొలనుల్లో వదిలిపెట్టింది. మత్స్యశాఖతో కలిసి వైద్యారోగ్య శాఖ ఈ చేపలను ఏర్పాటుచేసింది. గంబూసియా చేపలను మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. ఈ చేపలు మస్కిటో లార్వాను ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వ ఆలోచన.
Translate this News: