Chandrababu: ఏపీలో మానవ అక్రమ రవాణా.. సీఎస్ కు చంద్రబాబు సంచలన లేఖ

ఏపీలో మానవ అక్రమ రవాణాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి తీసుకు రావడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

New Update
Chandrababu: ఏపీలో మానవ అక్రమ రవాణా.. సీఎస్ కు చంద్రబాబు సంచలన లేఖ

Chandrababu Letter To CS Over Human Trafficking: ఏపీలో మానవ అక్రమ రవాణాపై సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియాలో (Cambodia) చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజన్సీలు యువతను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడిందన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. కాంబోడియా, లావోస్, ఇతర ప్రాంతాల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధిత యువత గమ్యస్థానాలకు చేరుకుంటోందన్నారు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Chandrababu Letter To CS Over Human Trafficking

Also Read: జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడు సతీష్ కు బెయిల్

Advertisment
Advertisment
తాజా కథనాలు