Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకో తెలుసా? రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి స్పెషల్ ఫ్లైట్లో చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతారు. By Nikhil 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్పోర్టుకు చంద్రబాబు వెళ్లనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు చేపట్టిన ఢిల్లీ పర్యటనకు రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత నెలకొంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు. గత ఐదేళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు సంబంధించిన వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రితో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #chandrababu-naidu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి