AP CID Chief: ఏపీలో ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి తిరుగులేని విధంగా పట్టం కట్టారు. వైసీపీని మర్చిపోలేని విధంగా చావుదెబ్బ తీశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై విదేశాలకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈరోజు (జూన్ 5) నుంచి వచ్చే నెల అంటే జూలై 3 వరకూ సెలవు తీసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లాలని ఆయన సెలవు పెట్టారు. ఆ సెలవును సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే ఆమోదించారు. మంగళవారమే ఉత్తర్వులు జారీచేశారు.
పూర్తిగా చదవండి..AP CID Chief: కొత్త ప్రభుత్వం వస్తుంటే.. సెలవులోకి సీఐడీ సంజయ్
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర పార్టీ నాయకులపై ఇష్టానుసారం కేసులు పెట్టారనే విమర్శలు ఎదుర్కున్న సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై విదేశాలకు వెళుతున్నారు. ఆయన నెలరోజుల పాటు వ్యక్తిగత కారణాలపై అమెరికా వెళ్ళడానికి సెలవు పెట్టినట్టు చెబుతున్నారు.
Translate this News: