AP: తోడికోడలిపై దాష్టీకం.. వేడి నూనెతో దాడి..!

కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మి అనే మహిళపై తోడికోడలే కక్షపెంచుకుని వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది.

AP: తోడికోడలిపై దాష్టీకం.. వేడి నూనెతో దాడి..!
New Update

Vijayawada: తోడికోడలిపై కక్షపూరితంగా వేడి నూనెతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో రాజ్యలక్ష్మి అనే మహిళ మీద సొంత తోడికోడలే కక్షపెంచుకుని వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది. దాడి చేసిన తోడికోడలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీష ఫైర్.. మహిళా ఉద్యోగులను లైంగికంగా..

తన తల్లిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ కుమార్తె డిమాండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే తన తల్లిని చంపడానికి వేడి నూనెతో దాడి చేసిందని ఆరోపించింది. తన కళ్లెదుటే తన భార్యపై నూనెతో దాడి చేశారని, గత కొన్ని ఏళ్ళుగా కక్షపెంచుకుని దాడి చేశారని బాధ్యత మహిళా భర్త ఆరోపిస్తున్నారు.

#vijaywada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి